హైదరాబాద్ : రాష్ర్ట రాజధాని హైదరాబాద్లో కొనసాగుతోన్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్లో కొవిడ్ కౌన్సెలింగ్ సెంటర్ను పరిశీలించారు. జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. స్వల్ప జ్వరం లక్షణాలున్న వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రుల్లో కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులు ఇచ్చే మందులను తప్పనిసరిగా వాడాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని ఆయన ఆదేశించారు. సీఎస్తో పాటు హెల్త్ సెక్రటరీ రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో పాటు పలువురు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..