మహబూబ్నగర్ : జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు అన్ని స్థానిక సంస్థలన్నింటిలో బీఆర్ఎస్ విజయం సాధించిందంటే ఇక్కడి ప్రజానీకానికి కేసీఆర్ మీద ఏ స్థాయిలో అభిమానం ఉందో అర్థం చేసు కోవచ్చని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. దేవరకద్రలో 30 చెక్ డ్యామ్ లు నిర్మించి ఎక్కడి నీటిని అక్కడే ఒడిసి పట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పారు. దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
కరివెన కురుమూర్తి రాయ లిఫ్ట్ ను నిర్మించి జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరందించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. నియోజక వర్గంలో రెండు మున్సిపాలిటీలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి.
నియోజకవర్గంలో రూ. 500 కోట్ల పెట్టబడితో కోజెంట్ పరిశ్రమ తన ఉత్పత్తులను మరింత విస్తరించింది. గత మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటిని 95 శాతం పూర్తి చేశాం. ప్రస్తుత మ్యానిఫెస్టోను ప్రతి పక్షాల మ్యానిఫెస్టోతో పోల్చుకుని ప్రజలు ఏది ఉత్తమైందో నిర్ణయించుకోవాలన్నారు. చేసిన అభివృద్ధిని భారీ మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.