మహబూబ్నగర్ : మధునాపురం మండలం నర్సింగాపూర్ గ్రామానికి శనివారం ఆర్టీసీ బస్ సర్వీసును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శనివారం ప్రారంభించారు. బస్సు వనపర్తి నుంచి బయలుదేరి కొత్తకోట నుంచి మధునాపురం మీదుగా నెలివిడి, నర్సింగాపూర్, కొన్నూర్, ద్వారాకనగర్ వరకు వెళ్లనున్నది. ఎన్నో సంవత్సరాల తర్వాత పల్లెలకు ఆర్టీసీ బస్ సర్వీస్ను పునరుద్ధరించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే తమ పిల్లల కష్టాలు ఇక తీరినట్లేనని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. బస్ సర్వీసును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే నర్సింగాపూర్ గ్రామానికి లక్ష్మీపురం స్టేజీ నుంచి ఎమ్మెల్యే నర్సింగాపూర్ వరకు బస్లో ప్రయాణించగా.. గ్రామస్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.