మహబూబ్నగర్ : నిన్న సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేసింది. సబ్బండ వర్ణాల సంక్షేమం, స్వావలంబనే లక్ష్యంగా మ్యానిఫెస్టో ఉండటం హర్షణీయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి(MLA Venkateshwar Reddy) అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజక వర్గ కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలు లబ్ధి పొందేలా రూ.5లక్షల బీమా కల్పించడం, ఆసరా పెన్షన్స్ను దశల వారీగా రూ.5000, రైతుబంధు 15 వేల వరకు పెంచడం వంటివి గొప్ప నిర్ణయం అన్నారు. ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలి. ఈ రెండు దఫాల్లో వేల కోట్ల రూపాయలు నియోజక అభివృద్ధి కోసం ఖర్చు చేశాం.
గతంలో 33 వేల మెజారిటీ ఇచ్చిన మీరు ఈసారి అంతకన్నా భారీ స్థాయిలో మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అద్భుతంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14కు 14 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎంకు జిల్లా ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నారు.