అసెంబ్లీ వేదికగా తాను చేసిన డిమాండ్లను సీఎం కేసీఆర్ విన్నారు. నాతోపాటు ఇతర ప్రతిపక్ష సభ్యుల మాటలు, డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. మేము చేసిన మంచి సూచనలు తీసుకొన్నారు. ఏ సమస్యలైతే సీఎంకు చేరడం లేదో వాటినే ప్రస్తావించాను. తాను ఎక్కడున్నా ప్రజల కోసం సైనికుడిలా పనిచేస్తా. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎవరితోనైనా కలిసి వెళ్లేందుకు సుముఖమే. సమస్యలు పరిష్కారమైతే సంతోషమే కదా. పేద విద్యార్థుల మెస్ చార్జీలు, ప్యాకెట్ మనీ, రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.
– ఎమ్మెల్యే ఈటల రాజేందర్
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి వందకోట్లు మంజూరు చేశారు. 14వ తేదీన కొండగట్టుకు వస్తానని మాట ఇచ్చారు. ఇంత భారీఎత్తున నిధులు కేటాయించడం, దగ్గరుండి ఆలయ పనులు పర్యవేక్షిస్తానని సీఎం చెప్పడం చాలా ఆనందంగా ఉన్నది. మా నియోజకవర్గ ప్రజలంతా ఆయనకు రుణపడి ఉంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.45 కోట్లతో ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించింది. మరో రూ.100 కోట్లు కేటాయించడం సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి నిదర్శనం. మాజీ ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఆలయ ఖ్యాతిని నలుదిశలా చాటేందుకు కృషి చేస్తున్నాం.
– ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మండలిలో 3 కమిటీలు
మండలిలో మూడు కమిటీల నియామకానికి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శానససభా వ్యవహారాల శాఖ మంత్రి తరఫున మంత్రి తలసాని బిల్లు ప్రతిపాదించగా, పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్లో ముగ్గురు సభ్యులు, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీల్లో ఇద్దరు సభ్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.