వరంగల్ : జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడిపల్లి- రాంపూర్లో యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు రూ.కోటిన్నర వ్యయంతో నిర్మించిన యశోద సేవా కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
కాగా, యశోద సేవా కేంద్రంలో యువతకు స్కిల్ డెవలప్ మెంటుపై శిక్షణ ఇవ్వనున్నట్టు యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ దేవేందర్ రావు వెల్లడించారు. ఈ కేంద్రంలో స్థానికులు ఉచితంగా ఫంక్షన్స్ కూడా నిర్వహించుకోవచ్చని, ఇక్కడ స్థానికులకు ప్రతి రోజు ఉచిత వైద్య పరీక్షలు యశోద హాస్పిటల్స్ తరపున జరపనున్నట్లు తెలిపిన దేవేందర్ రావు తెలిపారు.
కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ దేవేందర్ రావు, స్థానిక సర్పంచ్ సురేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.