మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న మేలును కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ (Shanker Naik) ఆరోపించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఉచిత కరెంటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని రైతు వేదికవద్ద ఏర్పాటు చేసిన నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) రైతు సంక్షేమానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, సాగు నీరు, తాగునీరు లాంటి పథకాలు ప్రవేశపెట్టి మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఒడిలో రైతులు ప్రశాంతంగా ఉన్నారని, అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసులు నవత్ ప్రియాంక ,నాయిని రంజిత్, గుండా రాజశేఖర్, తేళ్ల శ్రీను, ఆవుల వెంకన్న, మహబూబ్ పాషా, లునావత్ అశోక్, దాము నాయక్, తప్పెట్ల వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.