జగిత్యాల : జల్లాలోని రాయికల్ మండలం అయోధ్యలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టబాటు ధర లభిస్తుందన్నారు. అంతకు ముందు జగిత్యాల రురల్ మండలం మోర పల్లి గ్రామంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.