నల్లగొండ : డిండి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తానని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్(MLA Ravindra Kumar )అన్నారు. గురువారం డిండి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీత, ఎంపీటీసీలు వెంకటయ్య, రాధిక, రైతుబంధు అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్ రావు, స్థానిక సర్పంచ్ మేకల సాయమ్మ, పీఏసీఎస్ చైర్మన్లు మాధవరం శ్రీనివాస్ రావు, నాగార్జున్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగా రెడ్డి, బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, అవిరినేని గోపాల్ రావు, గ్రామ అధ్యక్షుడు గెలమోని శ్రీను, భగవంత రావు, గొడుగు వెంకటయ్య, తండు చంద్రయ్య, గుర్రం రాములు,శ్రీనివాస్ గౌడ్, కలిమ్, ఈశ్వరయ్య, తిరపతయ్య, బొడ్డుపల్లి జయంత్, తండు వెంకటయ్య, శ్రీను, సురేష్, తదితరులు పాల్గొన్నారు.