మానకొండూర్ రూరల్, మార్చి 4: తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కి, సమైక్యవాదులకు సద్దులు మోసిన వ్యక్తి రేవంత్రెడ్డి అని, ఆయనకు తమ గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. సమైక్యవాదుల బూట్లు నాకిన రేవంత్రెడ్డి, కామన్ సెన్స్ లేని కవ్వంపల్లి లాంటి చిల్లరగాళ్ల మాటలను ప్రజ లు ఎప్పటికీ నమ్మరని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మానకొండూరులో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మె ల్యే రసమయి, ఎమ్మెల్సీ కవితను దూషించడానికే కాంగ్రెస్ సభ నిర్వహించారని మండిపడ్డారు.