ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి.
చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్కు పరిపాటిగా మారింది. గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ దిగజారింది. ఇప్పుడు రాజాసింగ్ అంతకంటే ఒక అడుగు ముందుకు వేశారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి హేయమైన చర్య
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు దాడులు చేయడం హేయమైన చర్య. అసత్య ఆరోపణలతో బురదచల్లడం మంచిది కాదు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపుకోసమే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సీబీఐ, ఈడీ, ఐటీలను ఉద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణ, బీహార్, ఢిల్లీలో ఈ సంస్థల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతి అంశాన్ని వివాదం చేసేందుకు, రెచ్చగొట్టేందుకు రాష్ట్ర బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.