లాభదాయకం కాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని శుక్రవారం మరోసారి చెప్పుకొచ్చారు. అందుకే కేంద్రం అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం లేదని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణవాదులు, నిపుణులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఒకవేళ బయ్యారంలో ముడి ఇనుప ఖనిజం నాణ్యమైనది కాకపోతే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2006లో సుమారు 50వేల హెక్టార్లను రక్షణ స్టీల్స్కు ఎందుకు అప్పగించింది? లాభాలు కనిపించకుండానే ఒక ప్రైవేట్ సంస్థ ఈ లీజుకు ముందుకొస్తుందా?
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సైతం మొదట్లో వనరులు లేవు. ఇతర ప్రాంతాల నుంచి తరలించిన ముడి ఖనిజంతో ఆ సంస్థ లాభాల్లో నడిచింది వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వ అసమర్థత, ప్రైవేటీకరించాలనే ఆతృతతో దాన్ని నష్టాల బాటపట్టించి, సిక్ కంపెనీగా ప్రకటించింది వాస్తవం కాదా? బయ్యారంలో ఫ్యాక్టరీ పెడితే ఇతర రాష్ర్టాల నుంచి ముడి ఖనిజాన్ని సరఫరా చేస్తామని ఎన్ఎండీసీ ప్రకటించింది వాస్తవం కాదా?
ఆయుష్మాన్ భారత్ పథకంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన పెంచుకోవడం లేదు. ఈ పథకాన్ని తెలంగాణ లో ఏడాదిగా అమలు చేస్తుంటే.. ఇప్పటికీ అమలు చేయడం లేదంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారిక వెబ్సైట్లోనే..2021 మే 18 నుంచి తెలంగాణలో ఈ పథకం అమలవుతున్నట్టు పేర్కొంది. 25.9 లక్షల కుటుంబాలు అర్హత సాధించాయని తెలిపింది. మరో 61.67 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ రూపంలో రూ.5 లక్షల కవరేజీ ఇస్తున్నదని స్పష్టం చేసింది. 3 రోజుల కిందటే ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ అమలులో ఉత్తమ రాష్ట్రంగా గుర్తించి తెలం గాణకు జాతీయ అవార్డు ప్రకటించింది.