తెలకపల్లి, డిసెంబర్ 5: ‘గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్’ కార్యక్రమానికి విశేష స్పం దన లభిస్తున్నది. సమస్యల పరిష్కారానికి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నడుం బిగించారు. ‘గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం తెలకపల్లి మండలం పర్వతాపూర్లో గడపగడపకూ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రేషన్, ఆసరా, పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా?. లేదా అని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.
ధరణిలో ఉత్పన్నమయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన సూచించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హనుమంతరావు, పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.