జోగులాంబ గద్వాల : గద్వాల(Gadwala) నియోజకవ వర్గ అభివృద్ధి నా ధ్యేయమని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy) తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసిందని, ఈ ప్రభుత్వంకళాశాలకు అవసరమైన సిబ్బందిని నియమించడం పట్ల సహరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో 300 పడకల దవాఖానను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీని ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించామన్నారు. గతంలో లాగే ఈ ప్రభుత్వంలో కూడా నిధులు తీసుకొచ్చి గద్వాలను అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. జిల్లాలో మెడికల్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.