MLA Kranthi | హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడంలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఈడీ నోటీసులు( ED Notice ) జారీ చేసిందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్( MLA Kranthi Kiran ) విమర్శించారు. జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలను చైత్యవంతులను చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోవడానికి కేంద్రం ఈడీ ద్వారా నోటీస్ ఇప్పించింది అని క్రాంతి కిరణ్ ఆరోపించారు.
ఈడీ నోటీసులతో కవితను బెదిరించినా, వేధింపులకు గురి చేసినా ఆమె ప్రజాక్షేత్రాన్ని వదలరని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదానీకి లక్షల కోట్ల లబ్ది చేకూర్చుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న మోదీకి, అమిత్ షాకు ఈడీ, సీబీఐ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని, మరోవైపు కవితను టార్గెట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలు సహించరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తగి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే కాంత్రి స్పష్టం చేశారు.