వికారాబాద్/పరిగి: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని తన నివాసంలో దోమ మండలం బొంపల్లి ఎంపీటీసీ, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు రాఘవాపూర్ రాములు, మాజీ సర్పంచ్ మాన్యానాయక్, మాజీ ఉపసర్పంచ్ శంకర్నాయక్, నాయకులు రంజానాయక్, దేవులానాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే ఏ ఎన్నికలైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు సబ్బండవర్ణాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో దోమ జెడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాఘవేందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు హరిశ్చందర్, డాక్యనాయక్, ఖాజాపాషా, రఫిక్, షేర్ఖాన్, బొంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్రం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.