స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 21: బీజేపీతో పొత్తు పెట్టుకునే గతి తమకు పట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మతఛాందసవాద పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సా ధించి 39 సీట్లు గెలిచామని, 18 శాతం ఓట్ల తో 8 సీట్లు సాధించిన బీజేపీతో తమకు పొత్తు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. 4 వేల ఓట్లు రాని బీజేపీ వారు లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకున్న బీఆర్ఎస్ను విమర్శించేందుకు సిగ్గుండాలని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ లేదని, తెలంగాణ కొరకు రాజీనామా చేయనివారు, ప్రజలకోసం జైలుకు పోనివారు, పోరాడని బీజేపీ నేతలు ఏ మో హం పెట్టుకొని విమర్శిస్తున్నారని ప్రశ్నించా రు. ఈ పదేండ్లలో ఎన్ని నిధులు తెచ్చారు? ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు? ఎన్ని వర్సిటీలు తె చ్చారు? ఎన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చారో? కిషన్రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చారా? కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ తెచ్చారా? తెలంగాణలో ఏం ఒరగబెట్టారని రథయాత్రలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.
గ్యారెంటీలు అమలు చేసే దమ్ముందా?
కాంగ్రెస్కు ఆరు గ్యారెంటీలు అమలు చేసే దమ్ముందా? అని కడియం ప్రశ్నించారు. అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీ అమలుకు సా ధ్యం కాని హామీలు ఇచ్చిందని అన్నారు. గ్యా రెంటీలను అమలు చేయలేక ఏడాదిలోపే కాం గ్రెస్ సర్కార్ ప్రజల ముందు నవ్వుల పాలవుతుందని జోస్యం చెప్పారు. అధికార దాహం తో కాంగ్రెస్ ప్రజలకు హామీల రూపంలో అరచేతిలో వైకుంఠం చూపించిందని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.