హనుమకొండ : సీఎం రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ అయ్యాక భాష మార్చుకుంటాడని అనుకున్నా. కానీ రోజు రోజుకు సహనాన్ని కోల్పోయి ప్రతిపక్షంపై దాడి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హనుమ కొండలో ఆయన మీడియా సమావేశాంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై మాట్లాడుతున్న వారిపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి తీరు జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాష్ట్రమైన తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల మెప్పుపొందారని గుర్తు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleswaram) రాజకీయం కోసమే వాడుకుంటుందని విమర్శించారు. చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసి రైతులకు నీళ్లందించాలి. ఏవైనా తప్పులు జరిగితే చర్యలు తీసు కోవాలని మేమే చెబుతున్నాం. అలాం టప్పుడు రాజకీయం చేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ అదో కుటుంబ పార్టీ అని ఆరోపించారు.
రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంటి? సోనియా, ప్రియాంక ఇద్దరు మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఒక్క సీటు ఎందుకు గెలుచుకోలేక పోయావని ప్రశ్నించారు. కాళేశ్వరంపై చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికే మేడిగడ్డకు బీఆర్ఎస్ వెళ్తోందన్నారు. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి సీఎం అనే విషయం గ్రహించి భాష మార్చుకోవాలని హితవు పలికారు.