నిజామాబాద్: బీఆర్ఎస్ అంటేనే భారత రక్షణ సమితి అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని విమర్శించారు. ఒకరేమో జోకర్, మరొకరేమో ఫేకర్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు తెలంగాణకు పట్టిన పీడ అని ఫైరయ్యారు. నిజామాబాద్ పట్టణంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు అరవింద్ యాక్సిడెంటల్ ఎంపీగా ఎన్నికయ్యాడన్నారు.
కారు పోతే కారు.. బండి పోతే బండి ఇస్తామన్ని బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. అరవింద్ ఇస్తానన్న పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలన్నారు. గల్లీలో మేమే.. ఢిల్లీలో మేమ అంటూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో, కేంద్రంలో అధికారం చేపట్టేది బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు.