యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో రైతులకు(Farmers) భరోసా, ప్రజలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. సోమవారం భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వరస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
రైతుల ధాన్యం కొనుగోలు(Grain Purchase) కోసం క్వింటాళుకు రూ. 2,700 మద్దతు ధర ఇవ్వాల్సి ఉంటే.. రూ.2,100 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. మిల్లర్లతో అధికార పార్టీ కుమ్మక్క అయిందని ఆరోపించారు. ప్రజలు కోరుకున్న మార్పు దిశగా మాత్రం ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాడుతామన్నారు.