హైదరాబాద్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు ఆయన సతీమణి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ అయిన జ్యోతికి కూడా వైరస్ సోకింది. గండ్ర దంపతులకు జ్వరం రావడంతో మంగళవారం రాత్రి కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అందులో వారికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
కాగా, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్టం పరిశీలించారు. అనంతరం మంత్రి నిరంజన్రెడ్డితో పాటే హెలికాప్టర్లో హైదరాబాద్కు వచ్చారు. కాగా, గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్లో ఉండాలని గండ్ర సూచించారు.