జయశంకర్ భూపాలపల్లి : బీఆర్ఎస్ది ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో, కార్యకర్తలు మేనిఫెస్టోలోని పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఒక్క ఓటుతో ఐదేళ్లు సేవకుడిగా పనిచేసిన. ఈ ఐదేండ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాననిమరోసారి గెలిపిస్తే అభివృద్ధిని కొనసాగిస్తానని హామీనిచ్చారు.
సీఎం కేసీఆర్ పాలనే రాష్ట్రానికి రక్షణ అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే అంధకారమేనన్నారు. ప్రజలను అష్టకష్టాలను పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. మాయమాటలతో ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి పనిచేసే వారికి పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.