జగిత్యాల : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి( Kalyanalakshmi ), షాదీ ముబారక్ పథకాలు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. జగిత్యాల(Jagithyala) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో 71 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల ఇండ్లలో ఆడబిడ్డల పెండ్లికి తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లిలు చేసేవారు. ఆ పరిస్థిని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి-షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి రూ.1,00,116ఆర్థిక సహాయం అందజేశారని పేర్కొన్నారు. ఇలాంటి పథకం దేశంలోనే మరెక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, దావా సురేష్, ఆర్.ఐ రాజేందర్ రావు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.