బషీరాబాద్, మార్చి 13 : రంజాన్ తోఫా ఎక్కడ అంటూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో ముస్లిం మహిళలు తహసీల్దార్ను ప్రశ్నించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే రంజాన్ తోఫా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
రంజాన్ తోఫా అందని ముస్లిం మహిళలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమకు తోఫా మాకు అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొంత మంది నాయకులు ముఖాలు చూసి తోఫాను పంపిణీ చేస్తున్నట్టు తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై తహసీల్దార్ షాహిదాబేగంను వివరణ కోరగా మజీద్ కమిటీ ఇచ్చిన లిస్ట్ ప్రకారం తోఫా అందిస్తున్నట్టు చెప్పారు.