సంగారెడ్డి : మెదక్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకార్(MLA Chintra Prabhakar) అన్నారు. గురువారం సంగారెడ్డి(Sangareddy) జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్(BRS) ప్రచార రథాలను(Campaign chariots) ఎమ్మెల్యే ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ ఇస్తామని తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందన్నారు. పాలన అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాణిక్యం, మామిళ్ల రాజేందర్, బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.