మహబూబ్నగర్ : మున్సిపల్ ఎన్నికల(Muncipal elections) సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. 48గంటల ముందు అన్ని విధాల ప్రచారాన్ని ఆపివేయాలని ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అధికారమదంతో తుంగలో తొక్కుతున్నారు . తాజాగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గద్వాల(Gadwala) పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి వార్డుల్లో పర్యటించారు.
అపార్ట్మెంట్లు, కాలనీల్లో మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు నిబంధనలు అతిక్రమించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చోద్యం చూడకుండా చర్యలు తీసుకోవాలని గద్వాల్ పట్టణంలోని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.