గద్వాల, సెప్టెంబర్ 11 : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి సుప్రీం లో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ గత నెల 24న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నిక చెల్లదంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరా లు సమర్పించారని ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు.
విచారణ జరిపిన హైకోర్టు బండ్ల ఎన్నికల చెల్లదని, ఎమ్మెల్యేగా అరుణను గుర్తిస్తూ ఇటీవల తీర్చునిచ్చింది. దీంతో కృష్ణమోహన్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఈ కేసు కు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్ని కుతంత్రాలు చేసినా తుది తీర్పు, న్యాయం తన వైపు ఉంటుందన్నారు.