మంచిర్యాల: తెలంగాణ బడ్జెట్ 2022ను మంత్రి హరీశ్ రావు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలవనుందని బడ్జెట్ సమావేశంలో ప్రకటించారు. దీంతో చెన్నూర్ ప్రజల తరుపున సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.