మంచిర్యాల : సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిషనల్ డీజీ జితేందర్కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై నిరాధారమైన ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీని కోరామన్నారు. దళిత నాయకులను అవమానించేలా పోస్టులు పెట్టే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి