మంచిర్యాల టౌన్, నవంబర్ 13: ‘తన పర్యటనలో రాష్ట్రంపై విద్వేషాన్ని పెంచుకొని ప్రధాని మోదీ మాట్లాడారని, ఆయన మాట్లాడినవన్నీ అబద్ధాలే అని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల ముందే ప్రధాని పర్యటనలు ఖరారు కావాల్సి ఉండగా, ఆగమేఘాల మీద ఎందుకు ఖరారు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆడియో, వీడియో టేపులను దేశమంతా చూసిందని, ఈ వ్యవహారం నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకే తెలంగాణలో పర్యటించారని మండిపడ్డారు. మోదీ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి ఏడాదిగా యూరియా ఉత్పత్తి అవుతుండగా, ఇప్పుడు జాతీయ చేయడమేంటని ప్రశ్నించారు. గుజరాత్లో ఇటీవల కూలిపోయి 140 మంది మరణానికి కారణమైన మోర్జీ వంతెన నిర్వహణ పనులను గడియారాలు తయారుచేసే కంపెనీకి అప్పగించడమేంటని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమన్న మోదీ.. బొగ్గుబ్లాకుల వేలాన్ని సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.