మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు (సిద్దాయపల్లి)లో నిర్మించిన 288 డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దాదాపు రూ.50 కోట్లతో ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.