రాజోళి, మార్చి 14 : తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మోటర్ను మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ఆన్చేసి రైతులకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగునీటికి ఇబ్బందులు పడొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
ఆయకట్టుకు సాగునీరు అందించేందుకే సోమవారం కర్నూల్ జిల్లా ఇరిగేషన్ ఎస్సీ శేఖర్రెడ్డితో తాను మాట్లాడినట్టు తెలిపారు. స్పందించిన ఆయన కేసీ కెనాల్కు నీటి ప్రవాహాన్ని తగ్గించినట్టు చెప్పారు. దీంతో మంగళవారం తుమ్మిళ్ల లిఫ్టు వద్ద నీటిమట్టం 291.5 అడుగులకు చేరడంతో పంపింగ్ ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు.