బెల్లంపల్లి రూరల్, ఆగస్టు 7: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంటున్న క్రమంలో ఎస్-3 బోగీలో నుంచి పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. స్టేషన్లో రైలు ఆగిన వెంటనే రైల్వే సిబ్బందితోపాటు లోకోపైలట్కు ఈ విషయాన్ని తెలిపారు. రైల్వే సిబ్బంది పొగలు వస్తున్న ఎస్-3 బోగీని పరిశీలించారు. రైలు బ్రేక్జామ్ అయినట్టు నిర్ధారించి వెంటనే మరమ్మతులు చేశారు. లోకోపైలట్తోపాటు రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.