ఖమ్మం వ్యవసాయం, జూలై 12 : ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చి పంటకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. నాలుగు రోజుల క్రితం ఇదే మార్కెట్లో క్వింటాల్ రూ.22,300 పలికి జాతీయ స్థాయిలో అత్యధిక ధరగా నమోదైన విషయం తెలిసిందే. కోల్డ్స్టోరేజీల్లో నిల్వ చేసుకొన్న పంటను రైతులు మంగళవారం యార్డులో అమ్మకానికి పెట్టారు.
దీంతో కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కే సత్యం అనే రైతు పంటకు జెండాపాటలో క్వింటాల్ ధర రూ.22,501 పలికి ఆల్టైం రికార్డు సృష్టించింది. సాధారణ రకం పంటకు గరిష్ఠ ధర క్వింటాల్ రూ.17,500 మాత్రమే పలికింది. పక్షం రోజులుగా మార్కెట్లో ఏసీ రకం పంటకు గిరాకీ పెరుగుతుండటంతో నిల్వ చేసుకొన్న రైతులు పంటను అమ్మకానికి తీసుకొస్తున్నారు.