వరంగల్: మిర్చి (Mirchi) ధర పసిడితో పోటీపడుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. దేశీయ మిర్చికి క్వింటాల్కు ధర రూ. 52 వేలు పలుకుతున్నది. కొద్ది రోజుల క్రితం ఈ మార్కెట్లో దేశీ రకం మిర్చి క్వింటాల్ ధర రూ. 48 వేలు పలికింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది. ములుగు మండలం ఎస్ నగర్ గ్రామానికి చెందిన రైతు బల్గూరి రాజేశ్వరరావు 7 బస్తాల మిర్చిని ఎనుమాముల మార్కెట్కు తీసుకొచ్చారు. దీనికి మార్కెట్లోని లాల్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారులు ధర రూ. 52 వేలు నిర్ణయించారు. ఇప్పటివరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, మిర్చికి భారీ ధర పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.