మహబూబ్నగర్ : జడ్చర్లలోని బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. పాఠశాలలోని కొందరు విద్యార్థినులు నిన్న 2 జడలు వేసుకోలేదు. ఈ విషయాన్ని గమనించిన పీఈటీ.. ఆ విద్యార్థినులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందరి చేత గుంజీలు తీయించారు. దీంతో బాధిత అమ్మాయిలందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాళ్ల నొప్పులతో నడవడానికి విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో కొంత మందిని ప్రిన్సిపల్ ఇంటికి పంపించారు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుంజీలు తీయించిన పీఈటీపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఈటీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.