జిల్లా రవాణా శాఖ అధికారి సుభాశ్
కోదాడ రూరల్, ఏప్రిల్16 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న కొవిడ్ టీకాను వేయించుకొని వైరస్ను తరిమేద్దామని జిల్లా రవాణాశాఖ అధికారి సుభాశ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వ్యాక్సినేషన్లో ఆయన రెండో డోసు వేయించుకొని మాట్లాడారు. కార్యక్రమంలో అర్బన్ వైద్యులు శైలజ, సురేంద్ర, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఐసొలేషన్ వార్డులను ఉపయోగించుకోవాలి : ఎంపీపీ
హుజూర్నగర్ టౌన్, ఏప్రిల్ 16 : కరోనా సోకిన వారు భయాందోళన చెందకుండా ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులను వినియోగించుకోవాలని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 45ఏండ్లు దాటిన వారంతా టీకా వేయించుకోవాలని సూచించారు.
ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి..
పాలకవీడు/హుజూర్నగర్ రూరల్ : కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధనుంజయనాయుడు కోరారు. శుక్రవారం పాలకవీడు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నాయకులు జానయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే హుజూర్నగర్ మండలం వేపలసింగారంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శిరీషాకొండారెడ్డి, ఆరోగ్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, సావిత్రి, స్వరూప, శ్రవణ్, సైదులు, ఆశ కార్యకర్తలు మరియమ్మ, జ్యోతి పాల్గొన్నారు.
కరోనాపై అవగాహన కల్పించాలి : ఎంపీడీఓ
నేరేడుచర్ల : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా సర్పంచులు, కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఏంపీడీఓ ఉపేందర్రెడ్డి సూచించారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మండలంలో కరోనా వేగంగా పెరిగిపోతున్నందున మాస్కు లేకుండా బయటకు రావొద్దన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగకుండా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గరిడేపల్లి : 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని గరిడేపల్లి, కల్మల్చెర్వు పీహెచ్సీల వైద్యాధికారులు బంగారు రమ్య, సుధీర్ సూచించారు. శుక్రవారం ఆయా పీహెచ్సీలలో కరోనా టీకాలు వేయించారు. స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా వ్యాప్తిని అరికట్టగలుగుతామన్నారు. వైద్యసిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.