హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్తు సరఫరా కల్పించామంటూ ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ట్వీట్ చేశారు. 2018 లోనే అన్ని గ్రామాలు కరెంటు సరఫరా కలిగి ఉన్నట్టు ప్రధాని మోదీ చెప్పారని, 2022 జూన్ 25 న ఎన్పీఏ (ఎన్డీఏ) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి కరెంటు వచ్చిందని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
‘అబద్ధాలు, పచ్చి అబద్ధాలు.. ఇప్పుడు బీజేపీ మార్క్ అబద్ధాలు.. 2018 ఏప్రిల్లోనే ప్రధాని మోడీజీ దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా కల్పించామని చెప్పారు. కానీ, 2022 జూన్ 25 న ఎట్టకేలకు ఎన్పీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముగారి గ్రామానికి కరెంటు వచ్చింది. ఇలా ఇంకెన్నిసార్లు దేశాన్ని ఫూల్ చేస్తారు మోదీజీ?’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.