హైదరాబాద్: మాతృమూర్తి వియోగంతో తీవ్ర విషాదంలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. గవర్నర్ మాతృమూర్తి కృష్ణకుమారి మృతి పట్ల మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. రాజ్భవన్లో ఆమె భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్ దంపతులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తల్లి కృష్ణకుమారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్కు, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ మాతృమూర్తి కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలని ఆయన భభగవంతుడిని ప్రార్థించారు.