హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల ముందుకు బడ్జెట్ను తీసుకువచ్చింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అనంతరం భట్టి, ఉత్తమ్ వేర్వేరు సభల్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దు సుమారు రూ.3.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. గత బడ్జెట్లో మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దానిపై 8-10% వరకు అదనంగా పెంచి రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్లుగా చూపనుందని తెలుస్తోంది.