హైదరాబాద్ : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామిరెడ్డి మృతి పట్ల మంత్రులు ఇంద్రకర్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంకట్రామిరెడ్డి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు. కాగా, వెంకట్రామిరెడ్డి రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందాడు. వెంకట్రామిరెడ్డి అంతిమ సంస్కారాలు రేపు ఉదయం పది గంటలకు ధరూర్ మండలం బూరేడిపల్లిలో నిర్వహిస్తారు.