హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు, క్రిస్టియన్ సోదర సోదరీమణులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, గిరిజజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఏసు ప్రభు ఆశీస్సులు మన అందరి పై ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ పండగకు కానుకలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. క్రీస్తు బోధించిన దయ, కరుణ, ప్రేమ ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలు అని చెప్పారు. అందరికి మంచి జరగాలని మంత్రి ప్రార్థించారు.
రాష్ట్రం లోని క్రిస్టియన్ పర్వదినాన్ని సోదర సోదరీమణులు కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని మంత్రి సూచించారు.