కవాడిగూడ, జూలై 5 : రోస్టర్ విధానంతో మాలలకు తీవ్ర అన్యా యం జరుగుతున్నదని రాష్ట్ర కార్మికశాఖ మం త్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మా లల రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ‘హలో మాల.. చలో ఇందిరాపార్క్’ నినాదంతో మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ మంచాల లింగస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మంత్రి వివేక్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోస్టర్ విధానాన్ని సవరించి ఎస్సీ గ్రూప్లో ఉన్న మాల, ఇతర 25 కులాల మొదటి రోస్టర్ పాయింట్ను 22 నుంచి 16కు మార్చాలని క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్పై ఒత్త్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణతోపాటు రోస్టర్ విధానంతో మాల విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్, మాల మహానాడు రాష్ట్ర చైర్మన్ ఎం భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బీ కిషన్, గౌరవ అధ్యక్షులు సీహెచ్ రాంచందర్, మాల ప్రజాఫ్రంట్ వైస్ చైర్మన్ డీ విశాల్, కో ఆర్డినేటర్లు నాందేవ్, అంజలి నాయకులు పాల్గొన్నారు.