యాదాద్రి, నవంబర్ 6: ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతోపాటు నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మధన్యమైందని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పీ విశ్వరూప్ అన్నారు. శనివారం యాదాద్రీశుడిని దర్శించుకున్న ఆయన స్వామివారికి పూజలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఏపీలో జగన్ అభివృద్ధి సంక్షేమ పథకాల వరదను పారిస్తున్నారని కొనియాడారు.