హైదరాబాద్, జనవరి 13 ( నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని, పనుల్లో మరింత వేగం పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విధించిన నిర్ణీత గడువులోపు నిర్మాణం పూర్తి కావాలని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ తుది దశ నిర్మాణపనులను వేముల పరిశీలించి.. అధికారులు, నిర్మాణసంస్థకు పలు సూచనలు చేశారు. ప్రధాన ప్రవేశం, ల్యాండ్ సేప్ ఏరియా, పోర్టికో, అంతర్గత రోడ్లు, ఫౌంటెయిన్ల నిర్మాణం, గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్సీలింగ్, జీఆర్సీ పనులు, కోర్ట్యార్డ్ ల్యాండ్ సేప్ పనులు, రెడ్ శాండ్ స్టోన్, ఫైర్వర్స్, ఎలక్ట్రికల్ వర్, అంతస్తుల వారీగా పనులను పరిశీలించారు. చరిత్రాత్మక కట్టడమైన ఈ పరిపాలన భవనానికి సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రకారం.. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా సెక్రటేరియట్ తుది దశ పనుల్లో మనసుపెట్టి పనిచేయాలని సూచించారు. మంత్రి వెంట నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, ఈఈ శశిధర్, శ్రీనివాస్, పలువురు ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.