బాల్కొండ/మోర్తాడ్, అక్టోబర్ 26: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతు వెల్లువెత్తుతున్నది. ఇప్పటికే అనేక కుల సంఘాలు బీఆర్ఎస్కు ఓటేస్తామని స్వచ్ఛందంగా తీర్మానం చేయగా, తాజాగా బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన తాంబూర్ వారి మున్నూరుకాపు సంఘం వేములకు జైకొట్టింది.
వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్రెడ్డికే ఓటు వేస్తామని 53 కుటుంబాల వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మోర్తాడ్కు చెందిన ఆదర్శ మున్నూరుకాపు సంఘ సభ్యులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని గురువారం ప్రశాంత్రెడ్డిని కలిసి అందజేశారు.