హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. సీఎం నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించాలని మంత్రి సూచించారు. సాధ్యమైనంత త్వరలో సచివాలయాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే.