నిజామాబాద్ : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించ వచ్చని తెలిపారు. జిల్లా కేంద్రంలో మంత్రి వేముల ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఫ్రీ కోచింగ్ కోసం మంత్రి వేములతో పాటు ఆయన సన్నిహితులు ఇచ్చిన 15 లక్షల రూపాయల చెక్కును నిజామాబాద్ సీపీ నాగరాజుకి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. తన వంతు అదనపు సహకారంగా నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించామని ఆయన తెలిపారు. అందులో అన్ని రకాల పోటీ పరీక్షల కు అవసరమయ్యే ఆన్లైన్ క్లాసుల పొందుపరిచామన్నారు.
979 మందికి ఉచితంగా నావంతు సహకారం అందిస్తుండటం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టబట్టి తెలంగాణను ఏ విధంగా సాధించారో విద్యార్థులు కూడా దీక్షతో చదివి ఉద్యోగం సాధించాలన్నారు. అన్ని సౌకర్యాలతో అందిస్తున్న ఫ్రీ కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించాఉ. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.