నిజామాబాద్ : తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్ల జెండా ఎగరవేశారు. తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.