గజ్వేల్ రూరల్, మార్చి 5: మెదడు మోకాళ్లలో పెట్టుకొని విపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు లేకపోతే లక్షల ఎకరాల్లో సాగు ఎక్కడిదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాట్లాడుతున్న నాయకులకు రాష్ట్రంలో సాగవుతున్న వరిపంట కనిపించడం లేదా? అని నిలదీశారు. ఆదివారం కొమురెల్లి మల్లన్నను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి మంత్రి దర్శించుకొన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని ప్రైవేటు హోటల్లో ఆదివారం జరిగిన కరీంనగర్ జిల్లా యాదవ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. గడిచిన ఎమిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, ఎక్కడ చూసినా పాడిపంటలు కనిపిస్తున్నాయని చెప్పారు.
బోయినపల్లి వినోద్కుమార్ గొప్ప నాయకుడని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్ పరిధిలో అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి మంచి వారికి ప్రాధాన్యం కల్పిస్తే ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉండి సేవ చేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ యాదవుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి గొర్రెల పంపిణీ చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, రాష్ట్ర యాదవ యువజన సంఘం అధ్యక్షుడు జక్కుల బాల్రాజుయాదవ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, గొర్రెల మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజు యాదవ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, యాదవ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నాగరాజుయాదవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు సత్యనారాయణ, భాస్కర్యాదవ్, మల్లేశంయాదవ్, ఓదెల్యాదవ్, ఎంపీపీ కిషన్రేణుక, బండ నర్సయ్యయాదవ్, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్, మార్చి 5: వృత్తిదారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కుల సంఘం భవనాన్ని వారు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితోపాటు వృత్తుల రక్షణకు సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, షాద్నగర్, కోదాడ, కల్వకుర్తి ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, మల్లయ్యయాదవ్, జైపాల్యాదవ్, బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.